NSCL Recruitment 2024 : నేషనల్ సీడ్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.1.41 ల‌క్ష‌లు..

NSCL Recruitment 2024 : నేషనల్ సీడ్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.1.41 ల‌క్ష‌లు..

NSCL Recruitment 2024 : ఢిల్లీకి చెందిన మినీ ర‌త్న కంపెనీ నేష‌న‌ల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSCL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. డైరెక్ట్ ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న 188 పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కాగా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 8వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఈ పోస్టుల‌కు ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌కు డిసెంబ‌ర్ 22వ తేదీన రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://indiaseeds.com/current-vacancy అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

మొత్తం 188 ఖాళీలు ఉండ‌గా వాటిల్లో డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజర్ పోస్టు 1, అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టు 1, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 5, సీనియ‌ర్ ట్రైనీ పోస్టులు 2, ట్రైనీ పోస్టులు 179 ఖాళీగా ఉన్నాయి. ట్రైనీ పోస్టుల‌కు గాను విజిలెన్స్ హెచ్ఆర్‌, క్వాలిటీ కంట్రోల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, అగ్రికల్చ‌ర్‌, మార్కెటింగ్‌, అకౌంట్స్‌, స్టెనోగ్రాఫ‌ర్‌, ఫిట్ట‌ర్‌, ఎల‌క్ట్రిషియ‌న్‌, వెల్డ‌ర్‌, డీజిల్, మెకానిక్‌, బ్లాక్ స్మిత్ విభాగాల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు అధికారిక నోటిఫికేష‌న్‌ను చూడ‌వ‌చ్చు.

NSCL Recruitment 2024 full details and how to apply

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను అనుస‌రించి సంబంధిత విభాగంలో క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, బీఈ, బీటెక్‌, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణులు అయి ఉండాలి. ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుల‌కు నెల‌కు రూ.1,41,260, అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు రూ.80,720, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల‌కు ఊ.57,920, సీనియ‌ర్ ట్రైనీ పోస్టుల‌కు రూ.31,856, ట్రైనీ పోస్టుల‌కు రూ.24,616 చెల్లిస్తారు.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టు అయితే గ‌రిష్ట వ‌యో ప‌రిమితి 50 ఏళ్లుగా నిర్ణ‌యించారు. అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు 30 ఏళ్లు, మిగిలిన పోస్టుల‌కు 27 ఏళ్లు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిని నిర్ణ‌యించారు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీల‌కు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు 10 ఏళ్లు వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఇచ్చారు. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.500 కాగా రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు ఫీజులో మిన‌హాయింపు ఇచ్చారు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా డిసెంబర్ 8వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది. కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌ను డిసెంబ‌ర్ 22న నిర్వ‌హిస్తారు.